
రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి అంతరాయం?
AP: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. సర్వర్లో సమస్య రావడంతో పింఛన్ల పంపిణీ ప్రారంభమైన కాసేపటికే నిలిచిపోయినట్లు సమాచారం. అయితే సర్వర్లో సమస్యను పరిష్కరించి తిరిగి పింఛన్ల పంపిణీని కొనసాగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో పర్యటించి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు.