ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మోసం.. రూ.2 కోట్లు వసూల్

60చూసినవారు
ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మోసం.. రూ.2 కోట్లు వసూల్
మేడ్చల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను ఓ యువకుడు మోసం చేశాడు. మేడ్చల్ జిల్లా కొంపల్లికి చెందిన కేతావత్‌ సంతోష్‌ అనే యువకుడు 40 మంది నుంచి రూ.2 కోట్ల మేర వసూలు చేశాడు. వారికి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి.. యువకులకు ఫేక్‌ హాల్‌టికెట్లు, నియామక పత్రాలు ఇచ్చాడు. డబ్బులు వసూలు చేసిన తర్వాత పరారయ్యాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :