నేటి కాలంలో ప్లాస్లిక్ వినియోగం విపరీతంగా పెరిగింది. తినటానికి, తాగడానికి, బజారు నుంచి సరకులు తెచ్చుకోవడానికి.. ఇలా ప్రతి పనికి ప్లాస్టిక్ బ్యాగులను వినియోగిస్తున్నారు. వాటిలో 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వస్తువులు ప్రమాదకరం. వీటిని రీసైక్లింగ్ చేసేందుకు వీలు పడదు. అలాగే ప్లాస్టిక్ బాటిళ్లు 450 ఏళ్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు సుమారు వెయ్యేళ్ల పాటు భూమిలో కరగవని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.