మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శీతల్ పోల్ అనే మహిళ.. ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు తన పిల్లలు అడ్డుకుంటున్నారని.. ఈ క్రమంలో ఐదేళ్ల బాలిక, మూడేళ్ల బాలుడిని కొట్టి చంపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శీతల్ పోల్ను విచారించగా.. తానే హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. దీంతో ఆమెపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.