బట్టలు విప్పమన్న జడ్జి.. కేసు పెట్టిన బాధితురాలు

111872చూసినవారు
బట్టలు విప్పమన్న జడ్జి.. కేసు పెట్టిన బాధితురాలు
అత్యాచారానికి గురైన యువతి గాయాలు చూసేందుకు బట్టలు విప్పమన్న మెజిస్ట్రేట్ పై కేసు పెట్టిన ఘటన రాజస్థాన్ లోని కరౌలీ జిల్లాలో చోటుచేసుకుంది. గత నెల 19న తనపై అత్యాచారం జరిగిందని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై జిల్లా కోర్టులో విచారణ సందర్భంగా జడ్జి బట్టలు విప్పి గాయాలు చూపించాలని ఆదేశించారు. నిరాకరించిన ఆ యువతి జడ్జిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.