ఏ ఎన్నికల్లో అయినా ఓటర్లకు కొంత గందరగోళం తప్పటం లేదు. తమ పేరు ఓటర్ల లిస్టులో లేకపోవటం.. ఓటర్ స్లిప్ అందకపోవటం.. తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో వేయాలో తెలియకపోవటం.. తమ ఓటు వేరే వాళ్లు వేయటం.. ఇలాంటి వాటికి ఎన్నికల సంఘం కొన్ని పరిష్కారాలు చూపిస్తోంది. అయితే, తమ ఓటు వేరే మరొకరు వేసారంటే ఓటరు ఆగ్రహంతో వెనక్కు వెళ్లిపోతారు. కానీ, అలా జరిగిన సమయంలో ఓటరు తమ ఓటు హక్కును సెక్షన్ 49(పి) ద్వారా వినియోగించుకొనే హక్కు ఉంటుంది.