చైనాలో 24 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాన్ జియోటింగ్ లైవ్ టెలికాస్ట్లో ఈటింగ్ ఛాలెంజ్లో పాల్గొని అతిగా తిని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జూలై 14న జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఆమె నిర్విరామంగా 10గం కంటే ఎక్కువసేపు తినడం వల్ల మరణించినట్లు తెలిపింది. ఆమె ప్రతి ఈటింగ్ ఛాలెంజ్లో 10కిలోల కంటే ఎక్కువ ఆహారాన్ని తినేదని సమాచారం. ఇలా అతిగా తినడం మంచిది కాదని.. ఆమె కుటుంబసభ్యులు వారించినా పట్టించుకోలేదట.