రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. అధికారులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బోరుబావిలో పడ్డ బాలుడిని సాత్విక్ ముజగొండగా అధికారులు గుర్తించారు. దాదాపు 16 అడుగుల లోతులో బాలుడు చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా బాలుడికి పైపుల ద్వారా ఆక్సిజన్ను అందిస్తున్నట్లు వివరించారు.