TSలోని సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లోని 9 లక్షల మంది విద్యార్థులకు ఆరేళ్ల క్రితం నిర్ణయించిన డైట్ ఛార్జీల మేరకు భోజనం పెడుతున్నారు. రెండు మూడేళ్లుగా సరకులు, మాంసం, కూరగాయల ధరలు పెరగడంతో నిర్దేశిత మెనూ అమలు చేయడం, విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం సాధ్యం కావడం లేదని ఆయా అధికారులు వాపోతున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం డైట్ ఛార్జీలను 25 నుంచి 27 శాతం వరకు పెంచేందుకు ఏడాదిన్నర క్రితమే నిర్ణయం తీసుకున్నా, ఆ ఫైల్ ఆర్థికశాఖ వద్ద పెండింగ్లో ఉంది.