ఉత్తర్‌కాశీ టన్నెల్‌పై అదానీ గ్రూప్ వివరణ

887చూసినవారు
ఉత్తర్‌కాశీ టన్నెల్‌పై అదానీ గ్రూప్ వివరణ
ఉత్తరాఖండ్‌‌లోని ఉత్తర్‌కాశిలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంతభాగం కుప్పకూలి 41 మంది కార్మికులు గత 16 రోజులుగా చిక్కుకుపోయిన ఘటనలో తమ ప్రమేయాన్ని అదానీ గ్రూప్ సోమవారం తోసిపుచ్చింది. ''సొరంగం కుప్పకూలడం దురదృష్టకరం. ఈ ఘటనకు మా సంస్థతో ముడిపెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ టన్నెల్‌ను నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించింది. ఆ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదు. అందులో మాకు షేర్లు కూడా లేవు'' అని అదాని గ్రూప్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
Job Suitcase

Jobs near you