తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని బుదవారం ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి లంకా రాఘవులు మాట్లాడుతూ. ఉపాధి హామీ కూలీల సమస్యలను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలన్నారు. ఈనెల 12న ఉపాధి హామీ కూలీల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు.