కాంగ్రెస్లో పలువురు న్యాయవాదులు చేరిక
![కాంగ్రెస్లో పలువురు న్యాయవాదులు చేరిక](https://media.getlokalapp.com/cache/6a/13/6a138d2724e09db6dc48b89ff6a93d37.webp)
పలువురు న్యాయవాదులు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ మంత్రి సీతక్క ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు.