ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన బోట్ల యజమానులు వీరే..!

80చూసినవారు
ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన బోట్ల యజమానులు వీరే..!
ప్రకాశం బ్యారేజీ దగ్గర గేట్లను ఢీకొట్టిన బోట్ల యజమానుల ఆచూకీని పోలీసులు క‌నుగొన్నారు. గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్‍కు చెందిన పడవలుగా పోలీసులు గుర్తించారు. కొన్నేళ్లుగా మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలోనే పడవలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. కుట్ర కోణం వెలికితీసేందుకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పోలీసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్న‌తాధికారులు సమీక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్