
వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తులు వేలం!
LICకి అనుబంధంగా ఉన్న LIC HFL నుంచి రూ.310 కోట్ల రుణం తీసుకున్న YCP మాజీ MP బుట్టా రేణుక దంపతులు వడ్డీ సహా ఇంకా రూ.340 కోట్లు చెల్లించాల్సి ఉండగా, గత ఐదేళ్లుగా చెల్లింపులు నిలిపేయడంతో వారి ఆస్తులను వేలం వేయాలని సంస్థ యోచిస్తోందట. ఈ మేరకు బంజారాహిల్స్లోని రూ.145 కోట్ల విలువైన ఐదువేల గజాల ఆస్తి, మాదాపూర్లోని బుట్టా కన్వెన్షన్ వేదికను మరోసారి వేలం వేయాలని సంస్థ ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.