రాజస్థాన్ లోని జైసల్మేర్ లో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ కు చెందిన ఓ గూఢచారి విమానం ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. సాధారణ శిక్షణా సమయంలో విమానం ప్రమాదానికి గురైనట్లు తెలిపింది.