రూ.349కే విమాన ప్రయాణం.. ఎక్కడికో తెలుసా?

78చూసినవారు
రూ.349కే విమాన ప్రయాణం.. ఎక్కడికో తెలుసా?
అసోంలోని లిలాబరి నుంచి తేజ్‌పూర్‌ మధ్య నడిచే విమాన సర్వీసులలో అతి తక్కువ ధరకే ప్రయాణించవచ్చు. కేవలం రూ.349 ఛార్జితో విమానంలో ప్రయాణించవచ్చు. ఈ విమాన సర్వీసులలో 50 నిమిషాల ప్రయాణానికి ఈ మొత్తాన్ని తీసుకుంటున్నారు. ఇందులో రూ.150 బేస్‌ ఛార్జీ కాగా.. రూ.199 కన్వినీయెన్స్‌ ఛార్జీ. ఈ విమానయాన సంస్థలకు ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం కింద ప్రోత్సాహకాలు లభిస్తుండటమే ఈ చౌక ధరలకు కారణమని ట్రావెల్‌ పోర్టల్‌ ఐక్సిగో తెలిపింది.

ట్యాగ్స్ :