వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి

74చూసినవారు
వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మరోసారి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. బుధవారం ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కాన్పూర్‌‌లోని పంకీ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు కొంతమంది దానిపై రాళ్లు వేశారు. ఈ ఘటనలో రైలు కోచ్ కిటికీలు పగిలిపోయాయి. అయితే ప్రయాణికులెవరూ గాయపడలేదు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్