ఎన్నికల వేళ.. రూ.1100 కోట్లు సీజ్

68చూసినవారు
ఎన్నికల వేళ.. రూ.1100 కోట్లు సీజ్
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో భారీగా నగదు, బంగారాన్ని సీజ్ చేశారు. అధికార వర్గాల ప్రకారం.. మే 30 వరకు ఆదాయపు పన్ను శాఖ మొత్తం రూ.1100 కోట్ల విలువైన క్యాష్, నగలను సీజ్ చేసింది. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే సీజ్ చేసిన అమౌంట్ 182% అధికం. గత లోక్‌సభ ఎన్నికల వేళ రూ.390 కోట్ల నగదును సీజ్ చేశారు.