చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఏనుగులు హల్చల్ చేశాయి. వసనాడు, నడుమూరు, గోనుగూరు గ్రామాల్లో సంచరిస్తూ పంట పొలాలను నష్టం చేస్తున్నాయి. వసనాడుకు చెందిన శాంతారామ్ అనే రైతు టమాటా పంటను ధ్వంసం చేశాయి. ఏనుగుల నుంచి పంటలను కాపాడాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.