భారత సరిహద్దుల్లో చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. సిక్కింకు 150కి.మీ. దూరంలో 6 అధునాతన యుద్ధ విమానాలను మోహరించింది. ఈ నెల 27న సేకరించిన శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెలుగు చూసింది. షిగాట్సెలోని ఎయిర్పోర్టులో చైనా జే-20 ఫైటర్లు మోహరించినట్లు తెలుస్తోంది.