సిఎం యోగి ఆదిత్యనాథ్ కు బాంబు బెదిరింపులు

574చూసినవారు
సిఎం యోగి ఆదిత్యనాథ్ కు బాంబు బెదిరింపులు
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, అయోధ్య రామాలయంలపై బాంబులు వేస్తామని బెదిరింపులకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బాంబులు వేసి యోగి ఆదిత్యనాథ్‌, అయోధ్యలోని రామాలయాన్ని పేల్చివేస్తామని బెదిరిస్తూ సోషల్ మీడియాలో నిందితులు పోస్ట్ చేశారని అధికారులు తెలిపారు. నిందితులు లక్నోలోని విభూతి ఖండ్ ప్రాంతానికి చెందిన తాహర్ సింగ్, ఓంప్రకాష్ మిశ్రాలుగా యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించింది.

ట్యాగ్స్ :