నేడు కీలక మ్యాచ్లో భారత్తో ఆస్ట్రేలియా తలపడుతోంది. ఈ మ్యాచ్పై భారత మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కంగారూల జట్టును అడ్డుకోవడంలో జస్ప్రీత్ బుమ్రా ఓవర్లే కీలకంగా మారతాయని అభిప్రాయపడ్డాడు. బుమ్రా ఎప్పుడు మైదానంలోకి దిగినా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాడని పేర్కొన్నాడు. ఆసీస్పై యార్కర్లనే సంధించే అవకాశాలు ఎక్కువ అని చావ్లా వ్యాఖ్యానించాడు.