AP: రాజమండ్రిలోని కడియం- నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ ఆధునికరణ కోసం సోమవారం నుంచి 45 రోజులపాటు, 26 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వాటిలో రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ ఎక్స్ప్రెస్ సహా డిమాండ్ ఉన్న రైళ్లు ఉన్నాయి. దీంతో విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్ వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి. పనులు ఆగస్టు10వ తేదీ వరకు కొనసాగనున్నాయి.