10వ తరగతి పరీక్షలు ముగించుకుని పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న దళిత బాలికలను బైక్లపై వచ్చిన యువకులు వేధించారు. బాలికలు తప్పించుకునేందుకు ప్రయత్నించగా యువకులు వారిని కొట్టారు. వారి పరిస్థితిని బాటసారులు గమనించి యువకులను తరిమికొట్టారు. ఈ ఘటన రాజస్థాన్ లోని ఖైర్తాల్ లో జరిగింది. ఈ ఘటనపై విద్యార్థిని ఉపాధ్యాయురాలు ఖైర్తాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.