CCTV VIDEO: నడిరోడ్డుపై 10వ తరగతి బాలికలపై వేధింపులు

83చూసినవారు
10వ తరగతి పరీక్షలు ముగించుకుని పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న దళిత బాలికలను బైక్‌లపై వచ్చిన యువకులు వేధించారు. బాలికలు తప్పించుకునేందుకు ప్రయత్నించగా యువకులు వారిని కొట్టారు. వారి పరిస్థితిని బాటసారులు గమనించి యువకులను తరిమికొట్టారు. ఈ ఘటన రాజస్థాన్ లోని ఖైర్‌తాల్‌ లో జరిగింది. ఈ ఘటనపై విద్యార్థిని ఉపాధ్యాయురాలు ఖైర్తాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.