మానవతా సాయంగా మాల్దీవులకు నిత్యావసర వస్తువులు ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించింది. బియ్యం, చక్కెర, గోధుమ పిండి, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, గుడ్లు తదితర వస్తువులను పరిమిత స్థాయిలో పంపేందుకు నిర్ణయించింది. వీటితోపాటు కంకర రాయి, నది ఇసుకను కూడా ఎగుమతి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా భారత్లో వీటి అవసరం ఎక్కువగా లేకపోవడంతో మాల్దీవులకు ఎగుమతి చేసేందుకు నిర్ణయం తీసుకుంది.