హిందువులు ఎంతో పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ఇవాళ ప్రారంభమయ్యాయి. కేధర్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిని సందర్శించాలనుకునే భక్తులు ఈ యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాత్ర కోసం ఉత్తరాఖండ్ టూరిజం అధికారిక వెబ్సైట్ని ప్రారంభించింది. యాత్రికులు తమను తాము నమోదు చేసుకునేందుకు టోల్ ఫ్రీ, వాట్సాప్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.