ఎన్నికలను బహిష్కరించిన చెంచుగూడెం గ్రామస్థులు

63చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలోని ఓ గూడెంలో మూడు రోజులుగా కరెంట్ లేకపోవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెం చెంచులు ఓట్లు వేయకుండా ధర్నా చేపట్టారు. కరెంట్ లేకుండా ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోలేదని ఎన్నికలను బహ్కిరించారు. దీంతో విద్యుత్ అధికారులు చెంచుగూడెంకు చేరుకున్నారు.