కర్నాటకలో ఇవాళ రెండో విడత లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగుళూరులో టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ లైన్ లో నిలబడి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు. ప్రజాస్వామ్యంలో మనకు దక్కే అవకాశం ఇదే అని ఆయన అన్నారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య.. మైసూరులో ఓటేశారు. ప్రస్తుతం..రాహుల్ ద్రావిడ్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.