కుమార్తెకు ప్రేతాత్మ వరుడు కావలెనని తల్లిదండ్రుల పత్రికా ప్రకటన

75చూసినవారు
కుమార్తెకు ప్రేతాత్మ వరుడు కావలెనని తల్లిదండ్రుల పత్రికా ప్రకటన
కర్ణాటకలోని పుత్తూరులో 30 ఏండ్ల క్రితం మరణించిన తమ కుమార్తెకు తగిన ప్రేతాత్మ వరుడు కావాలని ఓ కుటుంబ పెద్దలు ప్రకటనలో కోరారు. సంప్రదించవలసిన ఫోన్‌ నంబరును కూడా ఇచ్చారు. ఈ ప్రకటనపై దాదాపు 50 మంది స్పందించారని వధువు కుటుంబ పెద్ద ఒకరు చెప్పారు. ప్రేత మడువే కార్యక్రమాన్ని నిర్వహించే తేదీని త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని తులునాడు ప్రాంతంలో మరణించినవారి ఆత్మలకు వివాహం చేసే ఆచారం ఉంది.

సంబంధిత పోస్ట్