మా పరిస్థితుల గురించి ఈసీ స్పందించట్లేదు: రాహుల్

531చూసినవారు
మా పరిస్థితుల గురించి ఈసీ స్పందించట్లేదు: రాహుల్
గురువారం న్యూఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల సమయంలో కనీసం పోస్టర్లు కూడా వేయలేకపోతున్నారు. ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు ఇలా చేయడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేయడం నేరపూరిత చర్య అని దుయ్యబట్టారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు.

సంబంధిత పోస్ట్