కర్ణాటక రాష్ట్రంలో హుబ్లీ జిల్లా
లో ఓ ఫేక్ న్యూస్ నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ప్రధాని
మోదీ గ్యారంటీ కింద మహిళల ఖాతాల్లో
రూ. 3వేలు జమ అవుతున్నట్లు దీని సారాంశం. దీంతో బీపీఎల్ కార్డులున్న మహిళలు పోస్టాఫీసుల వద్ద భారీ సంఖ్యలో క్యూ కట్టారు. దీంతో పోస్టాఫీస్ సిబ్బంది ఆరా తీయగా.. అసలు విషయం బయట
పడింది. ఇది తప్పుడు వార్త అని, అలాంటి స్కీం ఎక్కడా లేదని అధికారులు స్పష్టం చేశారు.