కెన్యాలో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం సైనిక హెలికాప్టర్ కుప్పకూలి 10మంది మిలటరీ అధికారులు మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం వేళలో రాజధాని నైరోబీ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల ప్రాంతంలో సైనిక హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆ దేశ డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లా (61)తో పాటు తొమ్మిదిమంది మిలిటరీ అధికారులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో అధికారికంగా ప్రకటించారు.