ఘోర ప్రమాదం.. 10 మంది మృతి (వీడియో)

78చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, ట్రక్కు ఢీకొని 10 మంది కూలీలు మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 13 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. ట్రక్కు అదుపు తప్పి ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను మార్చరీకి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత పోస్ట్