ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐసీయూలోని రోగి మృతి (VIDEO)

69చూసినవారు
కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సెంట్రల్ కోల్‌కతాలోని ప్రభుత్వాస్పత్రిలో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన ఆస్పత్రి వర్గాలు వెంటనే అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న 10 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఐసీయూలో ఉన్న రోగి మృతి చెందారు. సుమారు 80 మంది పేషెంట్లను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు.

ట్యాగ్స్ :