సిద్దిపేటలో కుంకుమ పువ్వు సాగు

74చూసినవారు
సిద్దిపేటలో కుంకుమ పువ్వు సాగు
ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన కుంకుమ పువ్వు ఉత్పత్తి సిద్దిపేటలోనూ మొదలైంది. కశ్మీర్ లాంటి చల్లని వాతావరణంలో సాగయ్యే ఈ పంటను DXN కంపెనీ ఏరోఫోనిక్స్ టెక్నాలజీతో సాగు చేస్తున్నారు. సిద్దిపేట అర్బన్ (M) మందపల్లిలో సాగుకు అవసరమయ్యే పరిస్థితుల్ని ఓ గదిలో ఏర్పాటు చేశారు. 40 వేల మొక్కలతో ఎకరా స్థలంలో రావాల్సిన 600 గ్రాముల పువ్వు గది విస్తీర్ణంలోనే సాగు చేశారు. ఇప్పటివరకు 200 గ్రా. కుంకుమ పువ్వు చేతికొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్