కేంద్ర ప్రభుత్వం పెన్షన్ దారులకు శుభవార్త తెలిపింది. అధిక పెన్షన్ను ఎంచుకునే ఉద్యోగుల వేతన వివరాలను యాజమాన్యాలు అప్లోడ్ చేయడానికి ఈపీఎఫ్వో 2024 మే 31వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో ఈ గడువు 2023 డిసెంబర్ 31తో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.