మధ్యప్రదేశ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు (వీడియో)

83చూసినవారు
గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనా మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఢిల్లీ-ముంబై మార్గంలోని రైల్వే యార్డు సమీపంలో పెట్రోలియం ఉత్పత్తులతో వెళ్తున్న రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ మార్గంలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని రత్లామ్ డిఆర్ఎం రజీనీష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్