జూన్ 28 నుంచి 30 వరకు వాయవ్య భారతదేశంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాఖండ్లో భారీగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఆ ప్రాంతానికి ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. జూన్ 28 నుంచి 29 వరకు తూర్పు ఉత్తర ప్రదేశ్, జూన్ 29 నుండి 30 వరకు హర్యానా, ఉత్తరప్రదేశ్లో భారీగా వర్షాలు పడతాయని తెలిపింది. జూలై 5 నాటికి దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది.