బ్రిటన్లో జులై 4న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీలు అక్కడ ఉన్న 10 లక్షల మంది హిందూ ఓటర్లపై దృష్టిసారించాయి. లండన్లోని శ్రీస్వామినారాయణ్ ఆలయాన్ని PM, కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్ సందర్శించారు. హిందువులు గర్వించే విధానాలను కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ కూడా కింగ్స్బరీలోని స్వామినారాయణ్ టెంపుల్కు వెళ్లారు. హిందువులపై దాడులను అడ్డుకుంటామన్నారు.