కంబోడియాలోని ఓ ఆర్మీ బేస్లో మందుపాతర పేలి 20 మంది సైనికులు మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని దేశ ప్రధాని హ్యూ మనెట్ వెల్లడించారు. ఈ ఘటనలో పలువురు జవాన్లు గాయపడ్డారు. కంపాంగ్ స్ప్యూ ప్రావిన్సులో శనివారం ఈ పేలుడు జరిగింది. పేలుడులో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని హ్యూ సంతాపం తెలిపారు. ఘటనతో తాను దిగ్భ్రాంతికి గురైనట్లు ప్రకటించారు.