బాగ్ అంబర్ పేట్ లో మురుగు నీటి సరఫరా

63చూసినవారు
బాగ్ అంబర్ పేట్ డివిజన్ పరిధిలోని పాముల బస్తి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్న బస్తీల్లో గత 20 రోజులుగా మురుగునీరు సరఫరా అవుతోంది. దీనిపై స్థానిక కాలనీవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంభందిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని లేదంటే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్పొరేటర్ స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.

ట్యాగ్స్ :