దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట్ లో నూతనంగా నిర్మించిన నాగుల ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కె. పి. వివేకానంద్ అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు శుక్రవారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయ సందర్శనలతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అలాగే దైవనామస్మరణ మనలోని చెడును తొలగించి మంచిది పెంపొందిస్తుందన్నారు.