AP ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే..

84చూసినవారు
AP ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే..
దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్​ఆర్టీసీ అదిరిపోయే వార్త చెప్పింది. అక్టోబర్ 4 నుంచి 20 వరకు 6,100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పిన ఆర్టీసీ.. ప్రత్యేక బస్సుల్లో ఎక్కడా అదనపు ఛార్జీలు వసూలు చేయటంలేదని తెలిపింది. ప్రత్యేక బస్సులన్నింటిలోనూ సాధారణ బస్సుల్లో ఛార్జీలనే వసూలు చేయనుండగా, ఈ సారి రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10 శాతం రాయితీ ఇవ్వనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్