కొందరు తనను బ్లేడ్తో కట్ చేస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "నన్ను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు ఉంటున్నాయి. వారు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి నన్ను, సెక్యూరిటీ వాళ్లను కట్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం ప్రొటోకాల్ పాటించాలి." అని పవన్ పేర్కొన్నారు. కాకినాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.