మహారాష్ట్ర మాజీ సిఎం, శివసేన (యుబిటి) పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తనను వీడిని వారిని తిరిగి పార్టీలోకి తీసుకోబోనని అన్నారు. శివసేన పార్టీని చీల్చి.. సిఎం పదవిని దక్కించుకున్న ఏక్నాథ్షిండేకు, అతని వర్గానికి ఈ మేరకు ఉద్ధవ్ మెసేజ్ ఇచ్చారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో శనివారం ఆ కూటమి నేతలు సమావేశమయ్యారు.