నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 19, 20 తేదీల్లో దేశవ్యాప్తంగా నిరసనలకు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) పిలుపునిచ్చింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. నీట్ ఫలితాల్లో హర్యానాలోని కోచింగ్ సెంటర్కు చెందిన విద్యార్థులు అత్యధికంగా 67 మంది మొదటి ర్యాంక్ సాధించారు. పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.