ప్రయాణికుడికి అస్వస్థత.. దారి మళ్లిన విమానం

54చూసినవారు
ప్రయాణికుడికి అస్వస్థత.. దారి మళ్లిన విమానం
విమానం గాలిలో ఉండగా ప్రయాణికుడికి అస్వస్థత కలగడంతో ఆ విమానం దారి మళ్లింది. శుక్రవారం ఇండిగోకు చెందిన 6ఈ-178 విమానం పట్నా నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరింది. అయితే విమానం గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. విమాన సిబ్బంది తక్షణ వైద్య సహాయం అందించారు. కాగా, మెడికల్‌ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆ విమానాన్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు మళ్లించారు. విమానం ల్యాండ్‌ కాగానే ఆ ప్రయాణికుడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :