ఏపీలో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న దృఢ సంకల్పంతో ఐటీ ఉద్యోగులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన యువత పెద్ద సంఖ్యలో హైదరాబాద్లో ఉద్యోగాల నిమిత్తం ఉంటోంది. వీరంతా సోమవారం సొంత ఖర్చులతో 42 బస్సుల్లో ఓటు వేయడానికి వచ్చారు. మలికిపురంలో బస్సులు ఆపి అక్కడి నుంచి వ్యక్తిగత వాహనాల్లో సొంత ఊళ్లకు వెళ్లి ఓటేశారు.