తిరిగి తెలంగాణ బాట పట్టిన ఏపీ వాసులు

79చూసినవారు
తిరిగి తెలంగాణ బాట పట్టిన ఏపీ వాసులు
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి తెలంగాణ బాటపట్టారు. దీంతో హైదరాబాద్ వైపు వచ్చే రహదారుల్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్‌గేట్ వద్ద సాధారణంగా 20 వేలకు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్తుంటాయి. అది నిన్న సాయంత్రం 6.30 గంటల వరకు 35 వేలకు పైగా చేరింది. ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు 6 లక్షల మంది తెలంగాణ నుంచి వెళ్లినట్లు అంచనా.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్