పాకిస్థాన్‌ ప్రధాని విందుకు జైశంకర్

82చూసినవారు
పాకిస్థాన్‌ ప్రధాని విందుకు జైశంకర్
షాంఘై సహకార సంఘం (SCO) వార్షిక సమావేశం పాకిస్థాన్‌లో జరుగనుంది. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ హాజరు కానున్నారు. ఈ క్రమంలో పాక్‌ ప్రధాని ఇచ్చే డిన్నర్‌లో జైశంకర్‌ పాల్గొనే అవకాశాలున్నట్లు తెలిసింది. ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు జైశంకర్‌ మంగళవారం ఇస్లామాబాద్‌కు వెళ్లనున్నారు. అనంతరం సభ్యదేశాల ప్రతినిధులకు పాక్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ఇచ్చే విందులో జైశంకర్‌ పాల్గొనే అవకాశాలున్నాయి.

సంబంధిత పోస్ట్